శ్రీమన్నారయణుని అవతారములు
మనం సాధారణంగా దశావతారాలనిగురించే మాట్లాడుకుంటూ ఉంటాము. భాగవతంలోని ద్వితీయస్కందములో బ్రహ్మదేవుడు నారదుడికి శ్రీమన్నారాయణుని లీలావతారాలను వర్ణించారు.భూమిమీద ధూళికణాలనైనా లెక్కపెట్టవచ్చేమోకాని శ్రీహరి అవతారాలను లెఖ్ఖపెట్టలేమని చెప్తూ సంగ్రహంగా అవతారాలను వివరిస్తారు.
ఈవిధంగా శ్రీహరి విశ్వము యొక్క ఉత్పత్తి స్థితి లయాలకు కారణభూతుడై విలసిల్లుతాడు.
మనం సాధారణంగా దశావతారాలనిగురించే మాట్లాడుకుంటూ ఉంటాము. భాగవతంలోని ద్వితీయస్కందములో బ్రహ్మదేవుడు నారదుడికి శ్రీమన్నారాయణుని లీలావతారాలను వర్ణించారు.భూమిమీద ధూళికణాలనైనా లెక్కపెట్టవచ్చేమోకాని శ్రీహరి అవతారాలను లెఖ్ఖపెట్టలేమని చెప్తూ సంగ్రహంగా అవతారాలను వివరిస్తారు.
- యజ్ఞవరాహఅవతారం: హిరణ్యాక్షుడనే రాక్షసుడు బాహుబలంతో భూచక్రాన్ని చాపచుట్టినట్టు చుట్టి సముద్రంలేే దాగుకున్నాడు.అపుడు శ్రీమన్నారయణుడు యజ్ఞ వరాహరూపం దాల్చి, వానిని ఎదిరించి సముద్రమధ్యంలో వానిని తన కొేరలతొే సంహరించాడు.
- సుయజ్ఞావతారం: రుచి అనే ప్రజాపతికి, స్వాయంభువుని కూతురైన ఆకూతికి జన్మించిన సుయజ్ఞుడు దక్షిణ అనే పత్నియందు సుయములనే పేరుగల అమరులను పుట్టించాడు. ఇంద్రుడై దేవతలకు నాయకత్వం వహంచాడు. విష్ణువై లోకాలన్నిటి దుఖ్ఖాలను తొలగించాడు
- కపిలావతారము: దేవహూతి కర్దమ ప్రజాపతికి శ్రీహరి కపిలుడుగా పుట్టాడు. సాంఖ్య యోగాన్ని తన తల్లికి చెప్పాడు
- దత్తాత్రేయఅవతారం
- సనక సనత్కుమార సనంద సనాతన నరనారాయణఅవతారం
- ధర్మునికి దక్షుని కూతురైన మూర్తియందు నర నారాయణులు పుట్టారు
- దృవావతారం
- పృదుచక్రవర్తి అవతారం: వేనుడనేరాజు బ్రాహ్మణశాపంతో భాగ్యము పౌరుషము కోల్పోయి నరకంలో పడ్డాడు. అప్పుడతని కొడుకు పృదువు తండ్రిని పున్నామ నరకం నుండి రక్షించాడు. శ్రీహరి అంశతో పుట్టిన పృదువు భూమిని ఆవుగా చేసుకొని అమూల్యమైన వస్తు సముదాయాలను పిదికాడు
- ఋషబావతారం: భగవానుడికి నాభి అనే మహారాజుకు కొడుకుగా పుట్టి జడయోగాభ్యాసాన్ని ఒనరించెను
- బ్రహ్మదేవుడు నిర్వహంచిన యజ్ఙంలో శ్రీహరి హయగ్రీవ అవతారమున ప్రత్యక్షం అయ్యాడు
- మత్స్యావతారము
- కూర్మావతారము
- నృశింహావతారము
- ఆదిమూలావతారము: మొసలి గజేంద్రుని కాలు పట్టుకున్నపుడు ఆదిపురషా అఖిలలోకనాధా అని ఆర్తితో పిలిచినపుడు, భగవానుడు గజేంద్రడిని రక్షించాడు
- వామనావతారం
- హంసావతారం: నారదుడికి హంసావతారంలో భగవానుడు భక్తియోగాన్ని ఉపదేశంచాడు
- మన్వావతారంలో శ్రీహరి మను వంశజుడై, దుష్టులగు రాజులను దమనము చేసి వారిని పాలంచెను
- ధన్వంతరి అవతారము: జీవుల వ్యాధులను తొలగించుటకు ఆయుర్వేదమును విశ్వమందు ఆరంభించెను
- పరశరామావతారం
- రామావతారం
- కృష్ణావతారం
- వ్యాసావతారం: తన రచనయగు వేదము అల్పజ్ఞులకు కష్టతరమని భగవానుడు యుగపరిస్తితులను అనుసరంచి వేదవృక్షాన్ని భిన్న శాఖలుగా విభజించెను
- బుధ్ధావతారం
- కల్కావతారం.
ఈవిధంగా శ్రీహరి విశ్వము యొక్క ఉత్పత్తి స్థితి లయాలకు కారణభూతుడై విలసిల్లుతాడు.